హైదరాబాద్‌లో బీజేపీ అమిత్ షా సందడి

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాయతీయ విమానాశ్రయంలో అమిత్ షాకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన బీజేపీ నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి చర్చలు జరిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, దీనికి సంబంధించిన నేతలకు దిశ నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. కాగా, అమిత్ ‌షా సమక్షంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ భారతీయ జనతాపార్టీలో చేరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu