పరమ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు

 

బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ డొక్కు ఆటోని ఆపారు. ఆటోని తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. కారణం, ఆ ఆలోలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోల బంగారు బిస్కెట్లు వున్నాయి మరి. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా కనుగొన్నారు. ఆటోలో వున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసులో మూడు కిలోల బంగారు బిస్కట్లు, 42 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. పోలీసులు, ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.