భూకంపం.. భారత్‌లో 10 మంది మృతి

 

నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది కూడా. నేపాల్‌లో భూకంపం కారణంగా వందలాది మంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. భూకంపం కారణంగా ఇండియాలో కూడా మరణాలు సంభవించాయి. బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. బీహార్లోని భగల్పూర్ గ్రామంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. భూప్రకంపనల ధాటికి బీహార్‌లో అనేక ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం వల్ల ఐదుగురు మరణించినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu