బరితెగించిన పాక్...ముక్కలుగా జవాన్ల దేహాలు..!

 

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన పోస్టులపై కాల్పులు జరిపగా ఇద్దరు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పాక్ అక్కడితో ఆగకుండా తమ క్రూరత్వాన్ని ప్రదర్శించింది. జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తమ పైశాచికాన్ని ప్రదర్శించింది. ఇక పాక్ చేసిన దారుణానికి భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పాక్‌ సైన్యం పిరికిపందల తరహాలో జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసిందని, అత్యంత హేయమైన ఈ చర్యకు దీటుగా బదులిస్తామని ఆర్మీ నార్తరన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu