మిస్టరీగా మారిన నావీ అధికారి కుమార్తె కేసు...

 

నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ గురించిన ఆచూకి ఇంకా తెలియక పోలీసులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈనెల 14న  విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. అయితే కనెక్టింగ్ విమానం ఎక్కేవారు విమానాశ్రయం బయటకు వెళ్లరు.. కానీ ఖైరవీ విమానాశ్రయం బయటకు వచ్చి ఓ పుష్పక్ బస్సు ఎక్కినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఆ తరువాత  ఆపై ఆమె సెల్ ఫోన్ బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆపై సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, ట్రేసింగ్ కష్టమైపోయింది. దీంతో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేక తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిందా అని ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు. దీంతో ఈకేసు మిస్టరీగా మారింది. త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.