ఆరో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

 

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఎండీ సమస్య పరిష్కారానికి చర్చలు నిర్వహించినా అవి కాస్తా విఫలమైన సంగతి తెలిసిందే. మరో పక్క హైకోర్టు కూడా సమ్మె విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించినా అవేమి పట్టించుకోకుండా కోర్టు తీర్పు కాపీ చేతికందేవరకు సమ్మే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ఆర్టీసీ ఈ.యూ నేత పద్మాకర్ . మరోవైపు అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఒప్పంద సిబ్బందితో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.