ఆడియో టేపుల నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఏపీ పోలీసులు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు వచ్చిన టేపులు టీన్యూస్, సాక్షి ఛానల్ లో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు ఛానళ్లకు ఏపీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ టేపులకు సంబంధించి సమాధానం ఇవ్వాల్సిందిగా ఛానళ్లను కోరారు.. కానీ ఈరోజుతో గడువు ముగియడంతో వారి నుండి సమాధానం రాని నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ టేపుల నిగ్గు తేల్చేందుకు రంగలోకి దిగనున్నట్టు సమాచారం. ఆడియో టేపుల్లో ఉన్న అతుకుల గుట్టును తెలుసుకునేందుకు.. ఆడియో క్లిప్పుల్లో ఎడిటింగ్ జరిగిందన్న అనుమానంతో వాటిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) విజయవాడలోని టెలికాం ప్రొవైడర్లతో భేటీ కానున్నారు. మొత్తం 12 సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రతినిధులతో చర్చించి ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనే విషయాలు తెల్చి తరువాత ఎలాంచి చర్యలు తీసుకోవాలి అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.