యంగ్ హీరో నితిన్ హీరోగా `ఛలో` దర్శకుడు వెంకీ కుడుముల డైరక్షన్ లో ఒక సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసింది. `భీష్మ` పేరుతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయని తెలిసింది. అంతేకాదు ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో యూనిట్ ఉందట. శరవేగంగా చిత్రీకరణ జరిపి జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడుతాయి. `అ ఆ ` తర్వాత సరైన విజయం లేని నితిన్ కి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. మరి `భీష్మ` తోనైనా నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.