`ఎన్టీఆర్ ` లైఫ్ హిస్టరీ ఆధారంగా బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తూ రూపొందిన చిత్రం `ఎన్టీఆర్` కథానాయకుడు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా టాక్ బాగున్నా... అందుకు తగ్గ కలెక్షన్స్ లేక ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ కథానాయకుడుగా ఎదిగిన వైనం చూపిస్తూ...ఎలాంటి ఎత్తుపల్లాలు లేకుండా స్టోరీ ఫ్లాట్ సాగడం వలన ...జనాలు అంతగా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయారు. ఇక దీంతో రెండో భాగమైన `ఎన్టీఆర్ మహానాయకుడు` చిత్రం పై అందరికీ సందేహాలు మొదలయ్యాయి. ముందుగా మహానాయకుడిని జనవరి 24న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, కథానాయకుడు ఎఫెక్ట్ తో ఫిబ్రవరి 7కు పోస్ట్ పోన్ చేశారు. ముందు కొంత భాగమే షూటింగ్ మిగిలున్నప్పటికీ మొదటి భాగానికి వచ్చిన విమర్శలు కారణం మళ్లీ కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ రీషూట్ లు కూడా చేసారట. దీంతో సినిమా రిలీజ్ డేట్ ఊగిసలాటగా మారింది. మార్చి 1న వచ్చే అవకాశాలున్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇన్ని ఊగిసలాటల మధ్య ఉన్నరిలీజ్ డేట్ ఈ రోజు కన్ఫార్మ్ చేసారు చిత్ర నిర్మాతలు. ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అవడంతో నందమూరి అభిమానలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
కథానాయకుడు చిత్రానికి అనుకున్న విధంగా రెస్పాన్స్ రాకపోవడంతో రెండోభాగమైన మహానాయకుడు విషయంలో అలా కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట దర్శకుడు క్రిష్. ప్రజంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ లో ఎన్నో మలుపులు ఉన్నాయి..అవన్నీ స్క్రీన్ పై కి తీసుకొస్తే కచ్చితంగా సినిమా ఆడే అవకాశాలున్నాయంటున్నారు సినీ పండితులు. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో.