![]() |
![]() |
మలయాళంలో లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన '2018' మూవీ తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటోంది. 2018లో ప్రజా జీవితాన్ని కకావికలం చేసిన కేరళ వరదల నేపథ్యంలో దర్శకుడు జ్యూడ్ ఆంథోనీ జోసెఫ్ రూపొందించిన ఆ సినిమా మలయాళ ఇండస్ట్రీకి కొత్త ఊపిరిలూదింది. అక్కడి ఎగ్జిబిషన్ సెక్టార్కు ప్రాణం పోసింది. టొవినో థామస్, కుంచకో బోబన్, ఇంద్రన్స్, అపర్ణా బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, నరైన్, అజు వర్ఘీస్, సిద్దిఖ్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల ఈ సినిమా తెలుగులో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. 8 రోజుల్లో 8.21 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఒక మలయాళం డబ్బింగ్ సినిమాకు ఈ కలెక్షన్లు రావడం పెద్ద విషయమే. 'ఎవెరీవన్ ఈజ్ ఎ హీరో' అనే టాగ్లైన్తో ఈ మూవీని బన్నీ వాస్ రిలీజ్ చేశారు.
కాగా తెలుగులో బాగా ఆడుతున్న సందర్భంలోనే ఈ సినిమా అన్ని భాషల్లో ఓటీటీ ప్లాట్ఫార్మ్ సోనీ లివ్లో విడుదలవుతుండటం గమనార్హం. ఇది థియేటర్లలో ఆడుతున్న తెలుగు వెర్షన్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 167 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
![]() |
![]() |