తేజ.. సినిమాటోగ్రాఫర్ నుండి రచయితగా మారి ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. చిత్రం, ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, జయం, అవునన్నా కాదన్న, నీకు నాకు డాష్ డాష్, నేనే రాజు నేనే మంత్రి, సీత మొదలైన సినిమాలకి తేజ దర్శకత్వం వహించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా తను దర్శకత్వం వహించిన సినిమా 'అహింస' విడుదలైన విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమా విషయాల గురించి ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి తేజ తెలుగువన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
డైరెక్టర్ గా తను ఎదుర్కొనన్న అనుభవాలను పంచుకున్నాడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ ఎవరితో తీద్దామని ప్రశ్నించగా.. ఇంకా ఏమీ అనుకోలేదు. ఆ టైంకి ఎవరు సెట్ అవుతే వాళ్ళనే తీసుకుంటానని తేజ చెప్పాడు. సినిమా షూటింగ్ కి అభిరామ్ ఫ్యాన్స్ వచ్చారా? మీరు అభిరామ్ ని టార్చర్ చేస్తంటే చూడలేక వెళ్ళిపోయారంట నిజమేనా అని ప్రశ్నించగా.. అసలు వచ్చింది అభిరామ్ ఫ్యాన్స్ కాదు వెంకటేశ్ గారి ఫ్యాన్స్. వాళ్ళు నేను టార్చర్ చేస్తే వెళ్ళలేదు. జనరల్ గా నన్ను చూస్తేనే వెళ్ళిపోతారు. ఏమో మరి నేను తిట్టింది చూసి వెళ్ళిపోయారేమో తెలియదని తేజ అన్నాడు. ఈ సినిమా అభిరాన్ ఫ్యూచర్ కి బాగా ఉపయోగపడుతుందా అని ప్రశ్నించగా.. అభిరామ్ బాగా చేసాడని సురేష్ బాబే చెప్పాడని తేజ వివరించాడు. అహింస మూవీ ఏ జానర్? ఎలా ఉండబోతుందని ప్రశ్నించగా.. ఇది యాక్షన్, ఫిలసాఫికల్, థ్రిల్లర్ సినిమా. ఇక సినిమా ఎలా ఉంటుందనేది ఆ రోజు ఆ టైంకి సినిమా చూసే ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటే అలా ఉంటుంది. చెత్త సినిమాని హిట్ చేసారు. మంచి సినిమాని ఫ్లాప్ చేసారు. ఎలా ఉంటుందనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సినిమాలు తీయడం వరకు నా వంతు.. దాన్ని హిట్ చేయడం, చేయకపోవడం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తేజ చెప్పాడు.
అభిరామ్ గురించి ఏమైనా చెప్తారా అని ప్రశ్నించగా.. గొప్ప యాక్టర్.. ఏదైనా సరే చెప్పింది చేస్తాడు. షూటింగ్ లో ఇది చేయను అని ఏ రోజు చెప్పలేదని అన్నాడు. అహింస సినిమా చూసాక మీకు కాంప్లిమెంట్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించగా.. వెంకటేశ్, అతడి భార్య సినిమా చూసి బాగుందని చెప్పారు. అంతకన్నా ఏం కావాలని తేజ అన్నాడు.