కేంద్రానికి జకీర్ నాయక్ సవాల్..

 

ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ ప్రసంగాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్నాయన్న ఆరోపణలు అతనిపై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని సంస్థలపై దర్యాప్తు చేసి.. యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా ప్రసంగాలు చేస్తున్నారి.. జకీర్ నాయక్ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేయడానికి... దాని పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. అంతేకాదు నిషేధానికి సంబంధించిన వివరాలను అందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.