ఆర్టీసీకి పైసా ఇవ్వని బాబు ఇండిగోకు 3 కోట్లు ఇచ్చారు: విజయసాయి ఫైర్

 

 

 

ఎన్నికల ముందు నుండి టిడిపి అధినేత చంద్రబాబును  ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేస్తున్న వైసిపి  అగ్ర నేత ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరో సారి విరుచుకు పడ్డారు. విజయవాడ-సింగపూర్ మధ్య వారానికి రెండు విమాన సర్వీసులు నడిపినందుకు ఇండిగో సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద నెలకు రూ.3 కోట్లు ముట్టచెప్పారని, కానీ పేదవాళ్ల ప్రయాణ సౌకర్యాల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, అందుకే చంద్రబాబును ప్రజలు తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పేద ప్రజల రవాణా సాధనమైన ఆర్టీసీ కష్టాల్లో ఉంటె ఒక్క రూపాయి ఇవ్వడానికి చంద్రబాబుకు చేతులు రాలేదని విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu