వైసీపీకి 5ఎమ్మెల్యేలు షాక్.. ఫోన్ చేసిన జగన్..
posted on Jan 8, 2016 4:17PM

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఆపార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నూల్ నుండి 14 అసెంబ్లీ స్ధానాలకు గాను వైసీపీ 11 స్థానాలు కైవసం చేసుకోగా.. టీడీపీ మాత్రం 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలలో అయిదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్టు వినికిడి. దీంతో పార్టీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారంట. పార్టీ మారే యోచనలో ఎవరున్నారో తెలుసుకొని వాళ్లకు ఫోన్ చేసి మరీ పార్టీ మారొద్దని సూచిస్తున్నారంట. అంతేకాదు పార్టీలో వారికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. మరికొందరు ఎమ్మెల్యేలకు చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ వెళ్లవద్దని సూచించారట. మరి జగన్ మాటను ఎమ్మెల్యేలు విని పార్టీ మారే యోచనను మానుకుంటారో లేక.. జగన్ మాటను పట్టించుకోకుండా పార్టీ మారతారో చూడాలి.