ఊరూవాడా అందరికీ చెప్పండి .. అన్నొస్తున్నాడని

తాను పాదయాత్ర చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ ముగింపు సభలో కార్యకర్తలనుద్దేశించి జగన్ మాట్లాడుతూ..అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దాదాపు ఆరు నెలల పాటు, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని చెప్పారు. ప్రతి జిల్లాకు వస్తానని..ప్రతి ప్రాంతంలో తిరుగుతానని, ప్రజలతోనే ఉంటానని తెలిపారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు ఊరూవాడా అందరికీ చెప్పండి .. అన్నొస్తున్నాడని జగన్ పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu