యోగి మరో నిర్ణయం.. వీఐపీ కల్చర్ వద్దు..

 

ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టోల్ ప్లాజాల వద్ద వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీఐపీ కల్చర్ ను పక్కన పెట్టాలనే యోచనలో ఉన్న యోగి సర్కార్... ఈ నిర్ణయం తీసుకుంది.