వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతా

వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతానని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాణెం హనిమిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు అద్దంకిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హనిమిరెడ్డి ఈ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయకుండా, ఆ తర్వాత నా దగ్గర అన్ని వేల ఓట్లు వున్నాయి, ఇన్ని వేల ఓట్లు వున్నాయి. మీ పార్టీలో చేరతానని ఎవరైనా అంటే, వాళ్ళని చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించారు. నేను రవికుమార్, గరటయ్య లాంటి వాడిని కాదని, చాలా తేడాగాడినని, తనతో జాగ్రత్తగా వుండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తనకు ఓటు వేసిన వాళ్ళకే తాను సేవకుడినని, తనకు ఓటు వేయని వాళ్ళు తన దగ్గరకి వస్తే మర్యాదగా వుండదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. తనకు ఓటు వేయని వాళ్ళకు తాను పని చేయనని స్పష్టం చేశారు. నేను మీకే ఓటు వేశాను. మా అబ్బాయి ఓటు వేయలేదు.. అతని పని చేసి పెట్టండి అని ఏ తండ్రి అయినా అడిగితే నేను వాళ్ళ పని చేయనుగాక చేయనని చెప్పేశారు. తనకు ఓటు వేసిన వాళ్లకి మాత్రమే తన సేవలు అందుతాయని పాణెం హనిమిరెడ్డి బెదిరిస్తున్నట్టు చెప్పారు. 

ఏమయ్యా హనిమిరెడ్డి.. నీ పార్టీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతావా? ఓటర్లకు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నీకు ఓటు వేసినవాళ్ళకే నువ్వు సేవ చేసే పనయితే, నీకు ఓటు వేయని వాళ్ళ మీద నీకు అధికారం ఏముంటుందయ్యా? నీకు ఓటు వేయని వాళ్ళకి నువ్వెలా ఎమ్మెల్యే (గెలిచినప్పుడు సంగతిలే) అవుతావయ్యా? నీకు ఓటు వేయని వాళ్ళు చెల్లించే పన్నుల మీద నీకెందుకు హక్కుంటుందయ్యా. ఓటర్లని చెప్పుతో కొట్టడమేంటి? మతి వుండే మాట్లాడావా.. లేక జగన్ బ్రాండ్ గంజాయి గానీ, మందుగానీ కొట్టి మాట్లాడావా? ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడే ఈ రేంజ్ పొగరు చూపిస్తున్నావు.. అద్దంకి ఓటర్లు పొరపాటున నీకు ఓటు వేశారంటే.. వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకున్నట్టు!

హనిమిరెడ్డి వ్యాఖ్యల పట్ల అద్దంకి నియోజకవర్గ ఓటర్లు చాలా సీరియస్‌గా వున్నారు. ఈనెల 13వ తేదీన హనిమిరెడ్డిని తమ ఓటుచ్చుకుని కొట్టడానికి రెడీగా వున్నారు. అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ పోటీలో వున్నారు. రవికుమార్ విక్టరీ ఆల్రెడీ కన్ఫమ్ అయిపోయింది. ఈ ఫ్రస్టేషన్లోనే హనిమిరెడ్డి ఓటర్లను చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చి వుంటారని పరిశీలకులు అంటున్నారు.