వంగవీటి రాధా అరెస్ట్..

 

వైసీపీ నేత వంగవీటి అరెస్ట్ తో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సింగ్ నగర్ కు చెందిన పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు వంగవీటి రాధా నేతృత్వ వహించారు. అయితే దీనికి పోలీసుల అనుమతి లేదంటూ.. దర్నా విరమించాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో వంగవీటిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులోకి ఎక్కించి అక్కడికి సమీపంలోని పాయకాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంగవీటి అరెస్ట్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu