విజయనిర్మల మృతికి అసలు కారణం...ఆ మహమ్మారే ?

కొద్ది రోజులుగా కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విజ‌య నిర్మల‌  నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె పార్ధివ దేహాన్ని నాన‌క రామ‌గూడ‌లోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. అభిమానుల సందర్శ‌నార్దం ఈ రోజు అక్క‌డే ఉంచ‌నున్నారు. రేపు మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. అయితే ఆమె చనిపోయింది హార్ట్ ఎటాక్ వలన అని మీడియాకి సమాచారం అందింది. కానీ తాజాగా ఈ విషయం మీద భిన్న ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే ఆమెకు గుండె జబ్బు కాదని, గత కొంత కాలంగా ఆమె క్యాన్సర్ తో బాధ పడుతున్నారని అయితే ఈ విషయాన్ని కృష్ణ, అలాగే కుటుంబం కావాలని దాచి పెట్టారని అంటున్నారు. గత కొద్దికాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారట. అయితే క్యాన్సర్ వ్యాధి ఉందని చెబితే ఆమె మీద మీడియా వరుస కధనాలు వండి వార్చడం అలాగే, ఆమెకి క్యాన్సర్ అంట అంటూ జనం చూపే సానుభూతిని కోరుకొని ఆమె కుటుంబం ఈ రహస్యాన్ని దాచేసినట్టు సమాచారం. అయితే క్యాన్సర్ సోకిందనే విషయం తెలిసినప్పటికీ విజయ నిర్మల చాలా ధైర్యంగా ఉన్నారని, క్యాన్సర్ వస్తే చాలా మంది డీలా పడిపోతారు, కానీ ఆమె ధైర్యంగా కాంటినెంటల్ హాస్పిటల్‌ లో క్యాన్సర్ వ్యాధి కోసం చికిత్స పొందుతున్నారని ఆమె మృతి తర్వాత తెలియవచ్చింది. ఇప్పటికే ఆమె మృతి వలన ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు, టాలీవుడ్ కి చెందిన వారు బాధ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తారో మరి.