తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం (ఏప్రిల్ 27) శ్రీవారిని మొత్తం 81వేల 212 మంది దర్శించుకున్నారు.

వారిలో 41 వేల 690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 88లక్షల రూపాయలు వచ్చింది.