ఇంటర్ పోల్ కు ఈడీ పూర్తి సమాచారం.. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు..!

 

విజయ మాల్యాను అరెస్ట్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయమని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌) ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే. దానికి ఇంటర్ పోల్ ను కూడా మాల్యా కేసు గురించిన ఇంకా సమగ్ర సమాచారం అందించమని ఆదేశించింది. అయితే ఇప్పుడు దానిపైమొత్తం సమాచారాన్ని పొందుపరుస్తూ నిన్న ప్రత్యుత్తరమిచ్చింది. దీంతో నేడో, రేపో మాల్యాపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మాల్యాను  ‘ప్రొక్లెమ్ డ్ అబ్ స్కాండర్’ గా ప్రకటించాలని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో నేడు విచారణ జరగననున్న నేపథ్యంలో దీనిపై కూడా సానుకూల ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మొత్తానికి 17 బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కిర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టిగానే ఉచ్చు బిగుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu