మాల్యా ధీమా.. నన్నేం చేయలేరు..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ లో మకాం పెట్టిన విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం బాగానే కష్టపడుతుంది. కానీ మాల్యా మాత్రం ఎలాంటి బెదురు లేకుండా కేసులో విజయం తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చిన మాల్యా మీడియాతో మాట్లాడుతూ.. తన మీద వచ్చిన ఆరోపణలేవీ నిలిచేవి కావని.. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. వందకోట్ల పౌండ్లు వసూలు చేయొచ్చని కలలు కంటూ ఉండొచ్చు.. కానీ సాక్ష్యాధారాలు లేకుండా ఏమీ చేయలేరు అని అన్నారు. కేసును వాదించేందుకు తగిన సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu