హైకోర్టు కూడా విడిపోవాల్సిందే.. వెంకయ్యనాయుడు
posted on Aug 4, 2015 3:51PM
![](/teluguoneUserFiles/venkaidh jithendar.jpg)
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల్లో హైకోర్టు వివాదం కూడా ఒకటి. ఈ విషయంపై తెలంగాణ వాదులు వాదనలు జరుపుతూనే ఉన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా లోక్ సభులో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును తప్పక విభజించాలని.. ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేశారని చెప్పారు. అయినా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఏపి సిఎం, సచివాలయం, డిజిపి ఉన్నప్పుడు హైకోర్టు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పుడు హైకోర్టు కూడా విడిపోవాల్సిందే.. అయితే హైకోర్టు విభజన పై ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని.. దీనిపై న్యాయశాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు.