సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అసెంబ్లీ.. పార్లమెంట్లలో నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అండర్‌-19 జాతీయ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ.. పార్లమెంట్ లో సభ్యులు అసభ్యకర పదజాలం వాడుతున్నారని.. సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. ప్రజా ప్రతినిధులు గౌరవప్రదమైన బాష మాట్లాడాలని.. సూచించారు. ప్రజలు బజారు సరుకును అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపుతున్నారని.. మంచి బాష మాట్లాడే వారిని ఎన్నుకొని వారిని సభలకు పంపిచాలని అన్నారు. అంతేకాదు సభల నుండి వాక్ అవుట్ చేస్తే మంచిది.. బ్రేక్ అవుట్ చేస్తే దేశానికే మంచిది కాదని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu