డిడిసిఎ పై కమిటీ రద్దు..అరుణ్ జైట్లీ కోసం..?

డిడిసిఎ వ్యవహారంలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలసిందే. డిడిసిఎ కుంభకోణంలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ హస్తం ఉందని ఆప్ నేతలు అంటున్నారు. కానీ అరుణ్ జైట్లీ మాత్రం వాటిని ఖండించి.. పరువు నష్టం కేసు కూడా వేశారు. మరోవైపు డిడిసిఎలో అవక తవకలపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం కమిటీ వేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దానిని రద్దు చేసింది. దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఢిల్లీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కేంద్రానికి ఆ అధికారం లేదని.. విచారణ ఎప్పటిలానే కొనసాగుతుందని అన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టి.. ఆప్‌ ప్రభుత్వం నియమించిన కమిటీ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రం, రాష్ట్రాలు మాత్రమే ఇటువంటి విచారణా కమిషన్లు నియమించడానికి అధికారం వుందని, ఢిల్లీ ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఇదే విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర.. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ని రద్దు చేయడంతో అరుణ్ జైట్లీ కోసమే కమిటీని రద్దు చేశారని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu