కేసీఆర్ కు పదవీగండమే.. ఉండవల్లి
posted on Jun 26, 2015 4:30PM

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి పై మండిపడ్డారు. కేసీఆర్ కు ఎప్పుడూ ఆంధ్రా వాళ్లను తిట్టడం తప్ప ఇంకేం పని లేదని విమర్శించారు. ఓటు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమని రుజువైతే కేసీఆర్ కు పదవీగండం తప్పదని, రేవంత్ రెడ్డి కేసుకు ఏపీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. అలా చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని.. శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్ర విభజన న్యాయబద్దంగా జరగలేదని.. పార్లమెంట్ లో బిల్లు చట్ట ప్రకారం పాస్ కాలేదని.. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని అన్నారు.