తెలంగాణ ఆవిర్బావ వేడుకలు ప్రారంభం

ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని మొదట పోలీసుల గౌరవ వదనం స్వీకరించారు. తరువాత పోలీసు కవాతు, తెలంగాణ సంస్కృతిని తలపించేలా చేసిన శకటాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు పలువురిని సత్కరించారు.