రోడ్డు ప్రమాదం.. తెలుగువారి దుర్మరణం

 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 29న షిర్డి తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు మచిలీపట్నం పరిసరాల నుంచి వీరందరూ బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో పండరీపురం దగ్గర వంతెన మీద నుంచి  నుంచి ఉజిని డ్యామ్ బ్యాక్ వాటర్ కాలువలో ఈ టూరిస్టు బస్సు పడింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్నవెంటనే రాష్ట్ర ఎక్సయిజ్ మంత్రి కొల్లు రవీంద్ర మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.