శశి థరూర్‌ని కాంగ్రెస్ గెటౌట్ అనేట్టుంది...

 

నరేంద్ర మోడీని భారీ స్థాయిలో పొగడ్డమే పనిగా వున్న కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ మీద బహిష్కరణ వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని శశిథరూర్ అనేకసార్లు ప్రశంసించారు. దాంతో థరూర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని, మోడీని పొగడ్డం మానుకోవాలని కేరళ కాంగ్రెస్ కూడా హెచ్చరించింది. అయినప్పటికీ శశిథరూర్ తన మాటల వేడిని ఏమాత్రం తగ్గించలేదు. ఈ పరిణామాలతోమాజీ మంత్రి శశిథరూర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి సూచించినట్టు సమాచారం.