తిరుమలలో భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 12 గంటల సమయం

 

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ సాధారణం ఉంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది. శుక్రవారం 64వేల 536 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30వేల 612మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా భక్తులు 3 కోట్ల 36 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.. విద్యాసంస్థలకు వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులు  కలిసి రావటంతో భక్తులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu