గ్యాంగ్‌రేప్ చేసి..కారులోంచి విసిరిపారేశారు

నిర్భయ లాంటి పదునైన చట్టం తీసుకువచ్చినా..ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కూడా రాజధానిగా మారింది. ఒక మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు కారులోనే గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం గ్రేటర్ నోయిడా సమీపంలో వేగంగా వెళుతున్న కారులోంచి ఆమెను బయటకు విసిరిపారేశారు. రాజస్థాన్‌లోని భరత్‌‌పూర్ నగర్‌కు చెందిన ఈమె పదిరోజుల క్రితం హర్యానాలోని సోహనాకు వచ్చింది. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ముగ్గురు దుండగులు మారుతి స్విఫ్ట్ కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం కారులోనే కొద్ది గంటల పాటు సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కారు గ్రేటర్ నోయిడా సమీపంలోకి రాగానే కారులోంచే విసిరిపారేశారు. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఈ నెలలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి..ఆటోలో పసిపాపతో వెళ్తుండగా..ఆ పాపను రోడ్డుపై విసిరేసి తల్లిపై ఆత్యాచారానికి పాల్పడ్డారు..ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.