కళ్ళంలో కారంకొట్టి 11 లక్షలు చోరీ...

 

కృష్ణాజిల్లా గుడివాడలోని రాజేంద్రనగర్ బ్యాంక్ అధికారి ఇంట్లో దుండగులు దోపిడీ చేశారు. బ్యాంక్ అధికారి రాంప్రసాద్ కళ్లల్లో కారం కొట్టి ఏటీఎంలో ఉంచేందుకు దాచిన రూ.11 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు రాంప్రపాద్ తెలిపారు. ఇల్లు అద్దెకు ఉందా అంటూ వచ్చిన దుండగులు తాను లేదని చెప్పేలోపే తన కంట్లో కారం చల్లి తన ఇంట్లోకి చొరబడి డబ్బు ఎత్తుకుపోయారని వివరించారు. వారిని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఈ సంఘటన మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరుపుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu