మాధవిలతపై కేసు 

హైదరాబాద్ లోకసభ బిజెపి అభ్యర్థి మాధవిలతపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేసు నమోదైంది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజంపురా పోలింగ్ బూత్ లోకి నేరుగా ప్రవేశించి ముస్లిం మహిళ వోటరు బురఖాను తొలగించారు.  ఈ సమాచారం ఎన్నికల కమిషన్ కు చేరింది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిలతపై నాలుగు వేర్వేరు సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశారు. ముస్లిం మహిళా వోటరు ఐడీ కార్డును తనిఖీ చేయడం వివాదానికి కారణమైంది. మాధవిలత సోమవారం ఉదయం పోలింగ్ జరుగుతున్న సమయంలో మలక్ పేటలో చేసిన హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu