ఎంసెట్ విద్యార్ధులకు బంపర్ ఆఫర్

 

రేపు తెలంగాణలో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్వీ రమణారావులు తెలిపారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రానికి సకాలంలో రావాలని, ఒకవేళ అనుకొని పరిస్థితిలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడం ఆలస్యమైతే దగ్గరలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే సౌకర్యం కల్పించామని చెప్పారు. అంతేకాదు దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్ధులకు పరీక్షా కేంద్రాలవద్ద బస కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.