తాజ్ మహల్ ను పేల్చేస్తాం...

 

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజ్ మహల్ ను పేల్చి పారేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్ర‌వాదులు తాజ్‌మ‌హ‌ల్‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఓ వెబ్‌సైట్‌లో వార్త రావ‌డంతో.. ప్ర‌త్యేక ద‌ళాలు ఆ మాన్యుమెంట్ చుట్టూ ప‌హారా కాశాయి.  ప్ర‌త్యేక పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని, తాజ్‌మ‌హ‌ల్ టూరిస్టుల‌పైన కూడా ప్ర‌త్యేక నిఘా పెట్టిన‌ట్లు ఎస్పీ ప్రీతింద‌ర్ సింగ్ చెప్పారు. కాగా ప్ర‌తి ఏడాది సుమారు 60 ల‌క్ష‌ల మంది ప‌ర్యాట‌కులు తాజ్‌మ‌హ‌ల్‌ను చూసేందుకు వ‌స్తుంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu