మమతా ప్రభుత్వంపై స్వామి ఫైర్...

 

ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ మహిళా నేత అయిన కృష్ణ భట్టాచార్య ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మమత ప్రభుత్వంలో చట్టాలు అమలు కావడం లేదని.. చట్టాలు సరిగా అమలయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని... లేదా ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. విధ్వంసానికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu