అమెరికాలో ఉండటం సబబేనా..?

అమెరికాలో జాత్యాంహకార దాడిలో మరణించిన తెలుగు ఇంజనీర్ కూచిభోట్ల శ్రీనివాస్ సంతాపసభ జరిగింది. ఈ సభలో శ్రీనివాస్ భార్య సునయన మాట్లాడుతూ..తన భర్త ఇంతటి దుర్మరణానికి అర్హుడు కాదని అన్నారు. తన భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసిన వ్యక్తి నానా దుర్భాషలాడాడని తెలిపింది. తన భర్త హత్య విషయంలో అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అమెరికాలో అమెరికా కోసం సేవ చేస్తున్న వారికి రక్షణ ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. అమెరికాలో ఏం జరుగుతోందని ఆమె నిలదీశారు.  అప్పుడప్పుడు తన భర్తతో ఎందుకీ జీవితం..మనదేశం వెళ్లిపోదామని అనేదానినని సునయన తెలిపింది. అయితే తన భర్త మాత్రం మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందన్నారు. కాని ఆయనకు మాత్రం మంచి జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు.