సుధీర్ కి స్రవంతికి మధ్య అన్ని ఐపొయట..మరి రష్మీ

 

 

ఫ్యామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ఉండగా ఆయన్ని, అలాగే వచ్చే టీమ్ మెంబర్స్ ని అలరించడానికి అన్నట్టు స్రవంతి చొక్కారావు, భానుశ్రీ ఇద్దరు సుధీర్ కి మరదళ్ళుగా ఉంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రాబోయే వారం ఎపిసోడ్ లో ఈ ఇద్దరు మరదళ్ళు కలిసి సుధీర్ ని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతూ ఉన్నారు. ఈ షోకి "భలే ఉన్నాడే" మూవీ ప్రొమోషన్స్ కోసం  స్పెషల్ గెస్ట్ గా హీరో రాజ్ తరుణ్ వచ్చాడు. "నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను వదిలేసేలా ఉన్నావ్ గాని నేను నా ఫామిలీని పిలిపించి తాంబూలాలు ఇప్పించేస్తా ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం" అని సీరియస్ గా చెప్పింది భానుశ్రీ.

దానికి స్రవంతి ఒక అడుగు ముందుకు వేసి "మనకన్నీ జరిగిపోయాయి కదా బావా" అనేసరికి సుధీర్ ఒక్కసారి ఉలిక్కిపడి ఎగిరి గంతేసాడు. ఇక కలిసుందాంరా వెర్సెస్ శతమానంభవతి సీరియల్ టీమ్స్ స్టేజి మీదకు  వచ్చాయి.  ప్రోమో ఫైనల్ లో "భలే ఉన్నాడే" మూవీ హీరోయిన్ మనీషా కందుకూరుని సుధీర్ ఒక ప్రశ్న అడిగాడు. "మేడం మీ లైఫ్ లో  ఎవరినైనా చూసినప్పుడు భలే ఉన్నాడే" అనిపించిందా అని అడిగాడు. "మిమ్మల్ని చూసాకే అనిపించింది" అని సుధీర్ ని చూసి చెప్పింది మనిషా. దానికి సుధీర్ ఫ్లాట్ ఐపోయాడు. ఇలా ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.