కనకదుర్గమ్మకి చంద్రబాబు కుటుంబం పట్టువస్త్రాల సమర్పణ!

దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి.. కుమారుడు, నారా లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు.  చంద్రబాబు కుటుంబంతో ఆలయం దగ్గరకి వచ్చినప్పుడు ఆయనకు కనక దుర్గ ఆలయ అధికారులు స్వాగతం పలికారు.