బాబా ఆరోగ్యంపై చివరి ప్రయత్నాలు

హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడించారు. సత్యసాయి ఆరోగ్యం విషయంలో వైద్యులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. బాబా శరీరంలో ఎక్కువ అవయవాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, నిఘా ఐడి గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu