ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పై కోపం ? ఎవరికంటే ...

నటుడు, పాటగాడు, గుప్పెడంత మనసు సీరియల్ మెయిన్ రోల్ లో నటిస్తున్న మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ కి కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. తెలంగాణ పాలిటిక్స్ మంచి హాట్ హాట్ గా సాగాయి నిన్న మొన్నటి వరకు.. ఎన్నికల ప్రచారం, ఫలితాలు, ఏ పార్టీ గెలుస్తుందా అంటూ ఎదురు చూపులు...చివరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని  తెలిసాక ఎవరు సీఎం కాబోతున్నారు అనే విషయం మీద  మంతనాలు...వీటికి తెర వేస్తూ రేవంత్ రెడ్డిని రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.

ఐతే కాంగ్రెస్ పార్టీ మీద చాల మందికి అంత సదభిప్రాయం  లేదు..ఐతే కర్ణాటక సీఎం డికె శివకుమార్ మీద సాయి కిరణ్  కి కోపం వచ్చింది. "తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి తలదూర్చడానికి డికె శివకుమార్ అసలు ఎవరు ? కాంగ్రెస్ పార్టీతో వచ్చే పెద్ద సమస్య ఇదే. కాంగ్రెస్ పార్టీ ఉండే ఇతర  రాష్ట్రాల నేతలంతా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టారు.  కర్ణాటకలో కాంగ్రెస్  ఉప ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వ్యూహాలు తెలంగాణలో అద్భుతంగా పని చేశాయన్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోని  అసంతృప్తులను డీకే శివకుమార్ బుజ్జగించి ఎలా లైన్ లోకి తీసుకొచ్చారో మనం చూసాం. తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. బెంగళూరు వేదికగా పరిష్కరించడంలో డీకే మార్క్ ప్రభావితం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవరకు డికె శివకుమార్ పాత్ర చాల ఎక్కువ...ఈ పాటి రాజకీయం చేయడం మన తెలంగాణ నేతలకు తెలీదా అన్నట్టుగా ఉంది  సాయికిరణ్  పోస్ట్.