బంగాళాఖాతంలో అల్పపీడనం

ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపధ్యంలో వారికి షాకింగ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందిందని రానున్న 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. ఇవాళ కూడా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu