పాక్‌పై భారత్ ఘనవిజయం

చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్‌లు ఎందులో పోటీపడినా అది యుద్ధ రంగాన్ని తలపిస్తుంది. తాజాగా ఆసియాకప్ హాకీలో మరోసారి దాయాది జట్లు బరిలో నిలిచాయి. ఢాకాలో ఇవాళ జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 3-1 తేడాతో భారత్ విజయం సాధించింది. చింగల్‌సేన, రమణ్‌దీప్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ తలో గోల్ కొట్టారు. ఈ విజయంతో పాక్‌పై భారత్ హ్యాట్రిక్ విజయం సాధించినట్టయింది. పూల్-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu