కొరియా ఓపెన్ సింధుదే

భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో ప్రతిష్టాత్మక కొరియా సూపర్ సిరీస్ టైటిల్ చేరింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18 సెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహరపై ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. కాగా..కొరియా ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఘన విజయం సాధించిన సింధును అభినందిస్తూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.