బేగంపేటలో మోడీ కాలినడక

ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు ప్రధాని నరేంద్రమోడీ. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ప్రధానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. ప్రధాని కోమటిబండ చేరుకునేందుకు మూడు ప్రత్యేక హెలికాఫ్టర్లు ఏర్పాటు చేశారు. విమానం దిగిన వెంటనే ఆయన్ను హెలిప్యాడ్ వద్దకు చేర్చేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. అయితే మోడీ ఆ కారు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లి హెలికాఫ్టర్ ఎక్కారు. దారి పొడవునా నేతలను, కార్యకర్తలను పలకరించుకుంటూ, వారిని ఉత్తేజపరుస్తూ వెళ్లారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu