ఉగ్రదాడిపై షరీఫ్ ఆదేశాలు..

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై జరిగిన ఉగ్రదాడి పై సంయుక్త విచారణ బృందం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా  ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ బృందం సమావేశమయింది. మరోవైపు ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో), ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్), ఎంఐ (మిలటరీ) అధికారులతో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ పైన దాడి కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా భారత్ ఒత్తిడితో పాకిస్థాన్ చర్యలకు సిద్దమైందని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu