చంద్రబాబుకు భద్రతను పెంచండి.. నిఘా విభాగం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత నిమిత్తం నిఘా విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు భద్రతను పెంచాలని.. సీఎం ప్రయాణించే హెలికాప్టర్, విమానాన్ని ప్రయాణానికి ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పలు సూచనలు చేస్తూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్ నుండి మకాం మార్చిన చంద్రబాబు లింగమనేని గెస్ట్ హౌస్ కృష్ణా నది ఒడ్డున ఉంటున్న సంగతి తెలిసిందే. దీని గురించి ప్రస్తావిస్తూ సీఎం కృష్ణా నది ఒడ్డున ఉన్నందున, నదిలో మెకనైజ్డ్ బోట్‌లో పోలీసులతో 24 గంటలు పహారా పెట్టాలని.. ఈ బోటులో గజ ఈతగాళ్లు, స్విమ్మింగ్ నెట్, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉండాలని తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu