పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన పసునూరి దయాకర్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండి వచ్చే నెల 23 వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పొంది లోక్ సభ సీటు గెలుచుకున్న పసునూరి దయాకర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దయాకర్ తో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు కొత్తగా ఎంపికైనా ఎంపీలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఉభయ సభల స్పీకర్లు స్పీకర్ సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీ సభలను ప్రారంభించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu