మరికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

మరికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ శీతాకాలంలో వేడి వేడిగా చర్చలు జరిపేందుకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రలతో సిద్దమయ్యాయి. ఇవాళ రేపు రాజ్యాంగం పై చర్చించనున్నారు. అంతేకాదు ఈ సమావేశాల్లో ప్రధాన బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చర్చలు జరగాలంటే సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సర్కార్ అన్ని పార్టీలను కోరింది. కాగా ఈ రోజు నుండి డిసెంబర్ 23 వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 34 బిల్లులపై చర్చలు జరపాలని అఖిలపక్షం నిర్ణయించింది. మరి ఎన్ని బిల్లులు చర్చకు వస్తాయో.. ఎన్ని బిల్లులకు అందరి ఆమోదం లభిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu