ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు... టీడీపీ నేతల ఆగ్రహం..

 

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి రెంజు రోజుల క్రితమే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జయంతి అలా జరిగిందో లేదో మరుసటి రోజే.. ఆయన విగ్రహానికి  గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో జిల్లా టీడీపీ నేతలు జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తే చేస్తున్నారు. ఎన్టీఆర్ కు అవమానం జరిగిందని.. విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు గ్రామంలో ధర్నాకు దిగారు. ఈ ఘటనలో ఎన్టీఆర్ విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu